రాంచీ: పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులు సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంటారు, అదే మాదిరిగా విపక్ష పార్టీలు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవిఎం)లను సాకులుగా చెబుతున్నారని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం ఝార్ఖండ్లోని లోహర్దగ్గాలో పర్యటించారు. ఈ సందర్భంగా బిజెపి ఏర్పాటు చేసిన ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు.
మూడు దశల పోలింగ్ జరిగిన అనంతరం ప్రతిపక్షాలకు ఓటమి అంగీకరించడం తప్ప మరో మార్గం మిగలలేదని మోది అన్నారు.
‘కాంగ్రెస్ తీరు వల్ల దేశ భద్రత ప్రమాదంలో పడుతోంది. 2014కి ముందు దేశంలో ఉగ్రవాద భయం ఉండేది. దేశంలో ఉగ్రదాడులు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయేది’ అని మోది వ్యాఖ్యానించారు.
బాలకోట్ దాడులను ప్రస్తావిస్తూ తాము ఏదైనా చేస్తే మోది నరకం చూపిస్తారనే విషయం టెర్రరిస్టులకు బాగా తెలుసునని అన్నారు. ‘మీ కాపలదారు ప్రభుత్వం పాకిస్థాన్కు గట్టి జవాబు ఇచ్చింది. వారి భూభాగంలోకి అడుగుపెట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టాం, ఉగ్రవాదం అంతం చూశాం’ అని మోది పేర్కొన్నారు.