వారణాసి: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోది నామినేషన్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. నామినేషన్కు ముందు నరేంద్ర మోది తన కంటే వయస్సులో పెద్ద వారైన ఇద్దరికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
మోది శుక్రవారం వారణాసి లోక్సభ స్థానానికి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే పక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు ప్రకాశ్ సింగ్ బాదల్కు మోది పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మిగిలిన నేతలను మోది పలకరించారు.
అలాగే తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన మహిళా కళాశాల ప్రిన్సిపాల్ అన్నపూర్ణ శుక్లా కాళ్ళను కూడా మొక్కి మోది ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మోది తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోది పాదాభివందనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోదికి ప్రధానినన్న అధికార గర్వం, అహంకారం లేవని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
#WATCH: PM Narendra Modi meets NDA leaders at Collectorate office ahead of filing his nomination from Varanasi parliamentary constituency. pic.twitter.com/xVfO9kovHP
— ANI UP (@ANINewsUP) April 26, 2019