ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మంచి దూకుడు మీద ఉన్న సమయంలో పోలవరం సమస్య వచ్చి పడింది. పోలవరం అంచనాలు బిల్లుల చెల్లింపుల్లో టిడిపి పై అవినీతి ఆరోపణలు చేసేది బిజెపి. కేంద్రానికి రాష్ట్రంపై పూర్తి ఇంట్రెస్ట్ ఉందని… నిధులు ఆపేది లేదని పోలవరం కంప్లీట్ చేసి క్రెడిట్ కొట్టేసే విధంగా బిజెపి అన్ని వేదికలపై పెద్ద పెద్ద డైలాగులు వేయడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా పోలవరం అంచనాలకు కేంద్రం కత్తెర వేయడంతో ఏపీ బీజేపీ నేతలకు టెన్షన్ పట్టుకున్నట్లు టాక్.
కేవలం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ ఇరిగేషన్ కంపౌండ్ నెంట్ కి మాత్రమే… నిధులు ఇస్తామని తేల్చిచెప్పడం మాత్రమే కాకుండా పోలవరానికి అసలైన సమస్య అయినా పునరావాసలకు సంబంధించి… పైసా కూడా ఇవ్వబోమని బీజేపీ స్పష్టం చేసింది. కేంద్రం చేసిన ఈ ప్రకటనతో రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి ఆగ్రహం తెప్పించింది. యూపీఏ ఇచ్చిన ప్రత్యేక హోదా లేదు అదే విధంగా రాష్ట్రానికి కీలక ప్రాజెక్ట్ అయినా పోలవరము లేదు…దీంతో ఎలా బ్రతకాలి అని ఏపీ జనాలు ప్రశ్నిస్తున్నారు.
ఈ పరిణామాలతో ఏపీ బీజేపీ నేతల నోట నుండి మాటలు రావడం లేదంట. ముందు నుండి పోలవరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని చంద్రబాబుకు పోలవరం ఏటీఎంల మారిందని గతంలోనే బీజేపీ లో ఉన్న కీలక నేతలు ఆరోపణలు చేయడం తెలిసిందే. అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో తాజాగా కేంద్రం చేతులు దులుపుకునే రీతిలో వేల కోట్లు ఖర్చు అయ్యే పునరావాసం సమస్య విషయంలో చేతులెత్తేయడంతో ఏపీ బీజేపీ నేతలు ఏమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. మరోపక్క జనాలు రెండు జాతీయ పార్టీలు ఏపీని అడ్డగోలుగా నాశనం చేశాయని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.