ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా…..
మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్
రాష్ట్రంలో మంచి పరిపాలన జరుగుతుంటే జే ట్యాక్స్ పేరుతో టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోంది. జే ట్యాక్స్ అంటూ టిడిపి నేతలు మరో సారి విమర్శిస్తే గత ప్రభుత్వంలో టిడిపి నేతలు ఎంతెంత ముడుపులు తీసుకున్నారో లెక్కలతో సహా బయట పెడతా. చంద్రబాబు హయాంలో కొన్ని బ్రేవరేజెస్కి మాత్రమే అనుమతులు ఇచ్చారు. ఎన్పిఆర్, ఎన్ఆర్సిలతో మైనార్టీలు అభద్రత భావానికి గురవుతున్నారు. ఎన్ఆర్సి రాష్ట్రంలో అమలు కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటించడం అభినందనీయం.
టిడిపి అధినేత చంద్రబాబు
టిడిపి వల్లే బిసి రాజకీయ సాధికారత సాధ్యమైంది. వైసిపి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బిసిల గొంతు కోసింది. పది శాతం కోత వల్ల బిసిలు 16వేల పదవులు కోల్పోతారు.
టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
రైతుల శ్రమను ప్రభుత్వం దళారులకు దోచిపెడుతోంది. మూడు వేల కోట్ల లిక్కర్ డబ్బులు సరిపోవడం లేదని ధాన్యం రైతుల డబ్బుపైన ప్రభుత్వం కన్నేసింది. ఇది వెయ్యి కోట్ల కుంభకోణం. మంత్రి కొడాలి నానిని పదవి నుండి బర్తరఫ్ చేయాలి.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
కేంద్రం ఇచ్చిన నిధుల వల్లే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోంది. భయబ్రాంతులకు గురి చేసి స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు యత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ ఆకృత్యాలను ప్రజలు ధైర్యంగా ఎదుర్కోవాలి. విషపూరిత జివోల వల్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో మద్యం మీద విపరీతంగా దోపిడీ చేస్తున్నారు.
వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నేరంగా పరిగణిస్తే తామసలు ఎన్నికల్లోనే పోటీ చేయమని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు. ఇది చంద్రబాబు చెప్పించిందే. కోర్టుల్లో కేసులు ఎవరితో వేయించాలి. ఏమాట ఎవరితో అనిపించాలనే స్కెచ్ వేయడంలో బాబును మించినోళ్లేవరూ లేరు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?