ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. దేశ ప్రధాని మొదలుకొని పేదవాని వరకు వణికించిన ఈ వైరస్…. అనేక బలమైన దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. ప్రతి వ్యక్తి జీవితాన్ని అతలాకుతలం చేసింది ఈ వైరస్. ఈ నేపథ్యంలో ఈ వైరస్ ని ఎదుర్కొనే దాని విషయంలో ఇప్పటికీ పర్ఫెక్ట్ వ్యాక్సిన్ రాని పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా దేశంలో మరికొద్ది రోజుల్లో బీహార్ అదేవిధంగా తమిళనాడు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ నేతలంతా ఫ్రీ బాబు ఫ్రీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ అన్న రీతిలో మేనిఫెస్టోలో రూపొందిస్తున్నారు.
ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి…. మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే కనుక కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా అందరికీ అందుబాటులోకి తెస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా మరోసారి అన్నాడీఎంకే పార్టీ కి అవకాశం ఇస్తే అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని హామీ ఇచ్చారు.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులో రాకముందే రాజకీయ పార్టీలన్నీ ఈ విధంగా వరాలు కురిపించడంతో ప్రజలు రాబోయే ఎన్నికలలో ఏ విధంగా వ్యవహరిస్తారు అన్నది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. మరోపక్క ప్రపంచం మొత్తం దృష్టి పెట్టిన ఆక్స్ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ఫలితాలలో తేడా వచ్చినట్లు…ఆ వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తి చనిపోయినట్లు తేలింది. దీంతో ప్రపంచం ఈ కరోనా బారినుండి ఎప్పుడు బయట పడుతుందో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో నెలకొంది. భారతదేశంలో మాత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్న రాజకీయ నాయకులు ఎలక్షన్ సమయంలో కరోనా వ్యాక్సిన్ ఫార్ములానే వాడుతున్నారు. ఒక కరోనా వ్యాక్సిన్ విషయంలో మాత్రమే కాకుండా చాలా సందర్భాలలో రాజకీయ నేతలు ఫ్రీ, ఫ్రీ అని ప్రజలకు ఇస్తున్న హామీలు అనేది చాలావరకు ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని మేధావులు అంటున్నారు