ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ శ్రేణులు ఊహించని కామెంట్ ఇది. కీలక సందర్భంలో మోదీ వైఖరి కారణంగా ఆయన్ను విపక్షం టార్గెట్ చేసింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని వెూదీ ప్రసంగించిన సంగతి తెలిసిందే. భారత సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే వారికి ఎల్ఓసీ మొదలు ఎల్ఏసీ వరకూ సైన్యం దీటైన జవాబిచ్చిందని ప్రధాని వెూదీ ప్రకటించారు. అయితే, వెంటనే ప్రధానిపై కాంగ్రెస్ విరుచుకుపడింది. సంచలన వ్యాఖ్యలు చేసింది.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రధాని వెూడీపై పరోక్షంగా విమర్శల దాడి చేశారు. అధికారంలో ఉన్న వారు చైనా పేరెత్తడానికి జంకుతున్నారని ఎద్దేవా చేశారు. చైనా పేరు ఎత్తడానికి అధికార పక్షం భయపడుతోందని కాంగ్రెస్ నేత విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు 130 కోట్ల మంది భారతీయులకు మన సైన్యంపై పూర్తి విశ్వాసముంది. చైనాకు దీటైన జవాబిచ్చిన సైన్యానికి మేము సెల్యూట్ చేస్తున్నాం. కానీ అధికార పక్షంలో ఉన్న వారి సంగతేంటి చైనా పేరెత్తడానికే వారెందుకు జంతుకుతున్నారని సూర్జేవాలా సూటిగా ప్రశ్నించారు.
ఇదిలాఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ రేఖ వెంబడి లేదా వాస్తవాధీన రేఖ వెంబడి మన దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసిన వారికి వారి భాషలోనే మన సైనికులు సరైన జవాబిచ్చారని తెలిపారు. ఉగ్రవాదం, విస్తరణవాదానికి సహాయపడే శక్తులను, వాటిని బలపరిచే శక్తులను ఓడించడానికి భారత్ సదా సిద్ధంగానే ఉంటుంది’ అని ఆయన స్పష్టం చేశారు. పొరుగు దేశాలతో సుహృద్భావ సంబంధాలను కోరుకుంటున్నామని వెూదీ స్పష్టం చేశారు.
పరస్పర విశ్వాసం, గౌరవంతోనే సంబంధాలు ఉండాలని కోరుకుంటుందని చెప్పారు. భూమి, సముద్రం సరిహద్దులు కలిగిన అన్ని దేశాలతోనూ సత్సంబంధాలు కోరుకుంటున్నామన్నారు. పొరుగు దేశాలతో కలిసి పని చేసేందుకు స్నేహ హస్తం అందిస్తున్నామన్నారు. దక్షిణాసియాలోని ప్రతి దేశంతో భారత్ కలిసి పని చేయాలని కోరుకుంటుందని, వేలాది సంవత్సరాలుగా సంవత్సరాలుగా సముద్ర తీర దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉందని వెూదీ గుర్తు చేశారు. అలాగే తూర్పు ఆసియా దేశాలతోనూ భారత్ స్నేహపూర్వక సంబంధాలు ఏర్పాటు చేసుకుందన్నారు. లడఖ్లో చైనా అతిక్రమణతో పాటు మన దేశ సైనిలిచ్చిన జవాబును ప్రపంచం మొత్తం చూసిందని వెూదీ పేర్కొన్నారు.