Breaking: మునుగోడు ఉప ఎన్నిక ను ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అభ్యర్ధులు, ఆయా పార్టీల నేతలు ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలు నిర్వహిస్తూ తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని కోరుతున్నారు. ప్రత్యర్ధులపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రభాకరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా స్రవంతి రెడ్డి, బీజేపీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ సహా ఇతర పార్టీలు, స్వతంత్రులతో కలిసి 40 మంది పైగా అభ్యర్ధులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానమైన పోటీ మూడు పార్టీల మధ్యనే నెలకొంది. అయితే టీఆర్ఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నదని ప్రత్యర్ధి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలో జససమితి నేత, ప్రొఫెసర్ కోదండరామ్ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి దిగడం హాట్ టాపిక్ అయ్యింది.
జనసమితి అధినేత, ప్రొఫెసర్ కోదండరామ్ హైదరాబాద్ లోని ఎన్నికల కార్యాలయంలో మౌన దీక్ష చేపట్టారు. బుద్దభవన్ లోని ఎన్నికల ప్రధాన అధికారి (సీఇఓ) కార్యాలయం వద్ద ఆయన నిరసనకు దిగారు. మునగోడు నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడులో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని కోదండ రామ్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక రద్దు కొరకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో ఈ సి నిబంధనలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. మంత్రులు అధికారిక హోదాలో హామీలు ఇస్తున్నారని కోదండరామ్ ఆరోపించారు. అధికార దుర్వినియోగం కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అధికారికంగా మద్యం పంపిణీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి కేటిఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తే హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారని అన్నారు. మతం, కులం పేరుతో ఓట్లు అడగడం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం పోతున్నదని అన్నారు.
Anand Mahindra: రిషి సునాక్ ఎన్నికపై సోషల్ మీడియాలో వైరల్ అయిన అనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్