దేశంలో పబ్జి గేమ్ యాప్ పై కేంద్రం నిషేధం విధించింది. పిల్లలలో నేరప్రవృత్తి పెంచేలా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం పబ్జి గేమ్ యాప్ పై నిషేధం విధించింది. పబ్జి సహా మొత్తం 118 చైనా యాప్లను కేంద్రం నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గూగుల్, యాపిల్, ప్లే స్టోర్ నుంచి పబ్జి తొలగింపు కార్యక్రమం కూడా చేపట్టింది. జూన్ 29న టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లపై నిషేధం విధించిన కేంద్రం, జులై 27 వ తారీఖున 47 చైనా యాప్లను నిషేధించింది.
కాగా తాజాగా మూడో విడతలో మొత్తం 118 నాయకుల పై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశంలో పిల్లల్లోనూ యువకులలో ఎక్కువ ఆదరణ పొందిన పబ్జి గేమ్ పై కూడా నిషేధం విధించడంతో పిల్లలు యువత కేంద్రం తీసుకున్న నిర్ణయానికి బాధపడుతున్నారు. పబ్జి బ్యాన్ చేసిన 12 గంటల్లో ఇండియాలో సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా స్టార్ట్ అయ్యాయి. లాక్ డౌన్ సమయములో అదేవిధంగా చదువుకున్నవాళ్ళు చాలావరకు పబ్జి గేమ్ కి అలవాటు పడిపోవడంతో వారికి కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాళ్ళు డైలమాలో పడిపోయారు.
దేశ సమగ్రత సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నాయి అని భావించి కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత ప్రజల రక్షణార్థం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. చైనా యాప్ ద్వారా డేటా చోరీ జరుగుతోందని గతంలోనే కేంద్రం నిర్ధారించింది. దీంతో జాతీయ భద్రతకు ప్రైవసీకి ముప్పుగా ఉన్నందునే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కేంద్రం తెలిపింది. మరోపక్క సరిహద్దులలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ పై యుద్ధానికి సై అనే రీతిలో వ్యవహరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అని మేధావులు చెప్పుకొస్తున్నారు.