ఏబీఎన్ రాధాకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ పరిస్థితి గురించి ఏపీని విమర్శిస్తూ, తెలంగాణా ని పొగుడుతూ ఓ వార్త ప్రచురించారు. కరోనా విషయంలో తెలంగాణా ని మించి దూసుకుపోతుంది ఏపీ అంటూ వార్త రాశారు. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఏపీలో కరోనా పాజిటివ్ రేటు తెలంగాణలో కంటే ఏపీలో పెరిగిపోయిందని దూసుకుపోతుంది అంటూ ప్రభుత్వంపై విమర్శలు వచ్చే రీతిగా వార్త రాసుకొచ్చారు. కరోనా వైరస్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, విఫలం అయిందని అన్నట్టుగా ఏబీఎన్ రాధాకృష్ణ వార్త ప్రచురించడం జరిగింది.
దీంతో ఈ వార్త చూసిన వీక్షకులు అసలు కరోనా టెస్టుల్లో తెలంగాణ రాష్ట్రం కంటే ఏపీ ముందు ఉందని, అంతెందుకు దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ ఉంది. పరిస్థితి ఇలా ఉండగా మొదటిలో తెలంగాణలో కరోనా వైరస్ విషయంలో తెలంగాణ లో చికిత్స సామాన్యులకు అందని పరిస్థితి ఉంది. కరోనా టెస్టుల్లో గాని, కరోనా రోగులకు సదుపాయాలు కల్పించే విషయంలో గాని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అప్పుడు మేలుకొని ఏబీఎన్ రాధాకృష్ణ ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేయడం దేనికి సంకేతము అంటూ ప్రశ్నిస్తున్నారు.
కరోనా చికిత్స విషయంలో…. కరోనా కు సంబంధించి ఏ విషయంలో అయినా… ఏపీ ప్రభుత్వం పై విమర్శలు ఏమాత్రం తగదు అని ప్రజలే రాధాకృష్ణపై మండి పడుతున్నట్లు టాక్. వాస్తవానికి అయితే ఎప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ అని వైసీపీ పార్టీ మద్దతుదారులు విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వంపై చాలా నెగిటివిటీ కల్పించే రీతిలో ఆర్టికల్ రావడంతో…. ఆ వార్త చదివి చాలామంది జనాలు తిట్టిన తిట్టు తిట్టకుండా ఏబీఎన్ రాధాకృష్ణ పై విమర్శలు చేస్తున్నారట.