పొలిటికల్ ఎంట్రీ అని చెప్పి సడన్ గా వెనకడుగు వేసిన రజినీ పట్ల ఆయన అభిమానులు ఎంతగానో నిరుత్సాహం చెందుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా నిర్ణయం మార్చుకోవడంతో చాలామంది రజిని తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదని అంటున్నారు. సరిగ్గా పొలిటికల్ ప్రకటన ఇంకా మరో రెండు, మూడు రోజుల్లో చేస్తారు అనగా… హైదరాబాద్ లో షూటింగ్ జరిగే సమయంలో రజిని అస్వస్థతకు గురవడంతో..రాజకీయాల్లోకి వెళ్ళటం దైవ నిర్ణయం కాదని భావించి వెంటనే ఈ విషయాన్ని లెటర్ ద్వారా అభిమానులకు తెలియజేయడం జరిగింది.
దీంతో అభిమానులు చెందుతూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. రజినీకాంత్ అభిమానులలో వీరాభిమాని రాఘవ లారెన్స్ కూడా ఒకరు అని అందాయికి తెలుసు. ఆయన రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుండో పట్టుబడుతున్న వారిలో రాఘవ లారెన్స్ కూడా ఉన్నారు. అయితే తాజాగా రజిని మళ్ళీ నిర్ణయం మార్చుకోవాలని నేను భావించాను.. కానీ ఆయన అనారోగ్యం కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని తెలిపారు.
ఇలాంటి తరుణంలో ఆయనపై ఒత్తిడి తీసుకు రాకూడదు. ఒకవేళ ఒత్తిడి మేరకు రాజకీయాల్లోకి వస్తే, జరగరానిది జరిగితే అప్పుడు ఇంకా బాధ పడాల్సి ఉంటుంది. కాబట్టి అభిమానులు నిరుత్సాహం చెందకుండా రజిని ఆరోగ్యం బాగుండాలని భగవంతుని ప్రార్థిద్దాం అంటూ.. రాఘవ లారెన్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.