వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి రెచ్చిపోయాడు. ఈసారి బాగా ముందుకెళ్లి జగతి పబ్లికేషన్స్ కేసులో ముగ్గురికి జైలు శిక్ష తప్పదని జోస్యం చెప్పాడు.ఎవరా ముగ్గురన్నది ఆయన చెప్పనప్పటికీ దీనిపై ఊహాగానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
రఘురామకృష్ణం రాజు ఈ మధ్య కాలంలో ఏది మాట్లాడినా సంచలన వార్తగా మారుతోంది.రఘురాం వ్యాఖ్యలతో ఇప్పుడు జైలుకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరు చెప్మా అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.అసలు రఘురామ విమర్శల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి..? జగన్ కేసుల విషయంలో నిజంగానే ముంపు పొంచి ఉందా..? ఆయా కేసుల్లో ఎవరెవరికి శిక్ష పడబోతోంది..? అనే అంశాలు ఉత్కంఠ భరితంగా మారాయి.ఈ మధ్య కాలంలో కొద్దిగా మౌనం పాటించిన రఘురామకృష్ణంరాజు తాజాగా మీడియా సమావేశంలో చెలరేగిపోయారు.
ముఖ్యమంత్రి జగన్ బాబాయి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీద కూడా ఆయన ధ్వజమెత్తారు సుబ్బారెడ్డి అవినీతి భాగోతాలపై ప్రధాని మోదీకి లేఖ రాశానని చెప్పారు .ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి ఏడు కొండలు ఏడు రెడ్లు అన్నట్టు తయారయిందన్నారు. తనపై సిబిఐ దాడులు జరిగాయంటూ నిరాధార వార్తలు రాసి, కథనాలు ప్రసారం చేసిన సాక్షి పత్రిక,సాక్షి టీవీలపై పరువునష్టం దావా వేస్తున్నట్లు చెప్పారు.వైసీపీ నేతలకు మానసిక సమస్యలు ఎక్కువయ్యాయన్నారు.వారేం చేస్తున్నారో వారేం మాట్లాడుతున్నారో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదన్నారు.ఓట్లు కావాల్సినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కావాలని.. గెలిచాక శిరోముండనాలు, దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు.పిచ్చివాళ్లతో ప్రభుత్వాన్ని నడిపించాలనుకోవడం మంచిది కాదని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ కిఅనేక సందర్భాల్లో హైకోర్టు గూబ పగలగొట్టింది కూడా ఎంపీ వ్యాఖ్యానించారు.ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పంథా మార్చుకుని ప్రజాహిత పాలన సాగించాలని ఆయన సూచించారు.కక్షపూరిత ,అప్రజాస్వామిక పాలన జగన్ కే చేటు చేస్తుందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తాయని కూడా రఘురామకృష్ణంరాజు చెప్పారు మొత్తానికి ఆయన వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయి.