MP RRR: ఎంపీ రఘురామకృష్ణ రాజు MP RRR వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత ఎంపీ నుంచే చికాకులు, తలనొప్పులు ఎదురవుతాయని ఊహించి ఉండరు. దేశంలో మరే ముఖ్యమంత్రికి కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవలేదు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన వ్యక్తి ఇలా.. పక్కలో బల్లెంలా మారతారని ఆయన ఊహించి ఉండరు. ఆయన పార్టీకి దూరం అయ్యారో.. పార్టీనే ఆయన్ను దూరం చేసుకుందో అనే విషయాలు పక్కనపెడితే రఘురామకృష్ణ రాజు సీఎం జగన్ కు ప్రతి విషయంలో అడ్డొస్తున్నారు. మొన్నటి ఆయన అరెస్టు నుంచి రఘురామలో వేగం మరింత పెరిగింది. సుప్రీంకోర్టు మాట్లాడొద్దంటే.. మౌనంగా ఉంటూనే లేఖలు రాస్తున్నారు. రోజుకో లేఖ రాస్తున్న రఘురామ ఇప్పుడు సరికొత్త అంశంతో జగన్ కు లేఖ రాశారు.
శాసనమండలిని రద్దు చేయాలంటూ సరికొత్త విషయాన్ని ఎత్తుకున్నారు. దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డికి రఘురామ లేఖ రాశారు. గతంలో మండలిని రద్దు చేయాలని జగన్ తీర్మానం చేసిన అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. మెజారిటీ ఉన్నప్పుడు మండలిని రద్దుచేస్తే మీ చిత్త శుద్దిని ప్రజలు నమ్ముతారని లేఖలో పేర్కొన్నారు. మెజారిటీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తిందని అన్నారు. మండలి కొనసాగించడం వృధా అవుతుందని ముఖ్యమంత్రిగా మీరే గతంలో చెప్పారు. ఆ మాటలను నమ్మాలంటే తక్షణమే శాసనమండలిని రద్దు చేయాలని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది. మండలిలో రాజధాని బిల్లు తీర్మానం విషయంలో జరిగిన అలజడి దృష్ట్యా 2020 జనవరిలో అసెంబ్లీలో మండలి సిఫారసు చేశారు సీఎం.
Read More: YSRCP: వైసిపీలో విజయసాయి సమస్య.. జగన్ చేయి దాటిపోతోందా..!?
రాజ్యాంగం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని.. ఏడాదికి 60కోట్లు మండలికి ఖర్చు దండగ అన్నారు. ఆర్టికల్ 169 ప్రకారం మండలి రద్దు అధికారం శాసనసభకు ఉందన్నారు. దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే మండళ్లు ఉన్నాయని.. అసోం, తమిళనాడు, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమకు మండళ్లు వద్దని కోరుతున్నాయని ఆనాడు జగన్ అన్నారు. కానీ.. ఆ నిర్ణయం మార్చి ఇప్పుడు మండళ్లు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మండలిలో ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు ఖరారయ్యారు. దీంతో వైసీపీ బలం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రఘురామ మండలిని రద్దు చేయాలని కోరుతున్నారు. రఘురామ లేఖను పట్టించుకుంటారో లేదో కానీ.. రఘురామ తన లేఖ ద్వారా ఈ విషయాన్ని హైలైట్ చేసినట్టైంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?