అమేఠీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్పై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది.రాహుల్ నామినేషన్ను ఆమెదించినట్టు అమేఠీ రిటర్నింగ్ అధికారి సోమవారం వెల్లడించారు.
ఈ సందర్భంగా రాహుల్ తరపు న్యాయవాది కేసి కౌషిక్ మీడియాతో మాట్లాడుతూ…’రౌల్ విన్సీ ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు.రాహుల్ గాంధీ 1995లో కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి ఎం.ఫిల్ పూర్తి చేశారు.ఆ సర్టిఫికెట్ కాపీని నేను అటాచ్ చేశాను. రాహుల్ గాంధీ భారత్ లో జన్మించారు. ఆయనకు భారతీయ పాస్ పోర్ట్ ఉంది.ఆయనకు వేరే ఏ దేశ పౌరసత్వం లేదు. ఆయన ఓటర్ ఐడీ,ఇన్ కమ్ ట్యాక్స్ ఇలా అన్నీ భారత్ లోనే ఉన్నాయి’ అని తెలిపారు.
కేరళలోని వాయనాడ్తో పాటు ఉత్తరప్రదేశ్లోని అమేఠీ లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్లో వివరాలు తప్పుగా ఉన్నాయంటూ స్వతంత్ర అభ్యర్థి ధ్రువ్ లాల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పౌరసత్వం, విద్యార్హతలను రాహుల్ తన అఫిడ్విట్లో తప్పుగా పేర్కొన్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల సంఘం ధ్రువ్ లాల్ ఆరోపణలను తోసిపుచ్చుతూ రాహుల్ నామినేషన్ను ఆమోదించింది.