రాజస్థాన్ రాజకీయాలు మొన్నటి వరకు చాలా రసవత్తరంగా సాగాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అదే రీతిలో ఆ పార్టీ యువ నాయకుడు సచిన్ పైలెట్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే రీతిలో, డి అంటే డి అన్న రీతిలో వ్యవహరించారు. పార్టీ నుండి బయటకు వచ్చేసినా సచిన్ పైలెట్, చాలావరకూ వేరే కుంపటి పెడతారా లేదా బిజెపి పార్టీ లోకి వెళ్ళిపోయి రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తారా అన్న చర్చ మొన్నటి వరకూ జరిగింది.
కానీ అనూహ్యంగా గురువారం జరగబోయే శాసనసభ పక్ష సమావేశం వేదికగా ఇద్దరూ చర్చకు రావాలని డిసైడ్ అవ్వడంతో రాజస్థాన్ రాజకీయాలు రచ్చరచ్చగా మారాయి. రాజస్థాన్ రాష్ట్రంలో ఈనెల 14వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇటువంటి తరుణంలో సచిన్ పైలెట్ తనకు మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చిన 19మంది రెబల్స్ తో కలసి తిరిగి సొంతగూటికి చేరటానికి రెడీ అయినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా సచిన్ పైలెట్ సొంతగూటికి వచ్చినా సరే సీఎం అశోక్ గెహ్లాట్ బలపరీక్షకు మొగ్గుచూపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీలో టాక్. ఈ విధంగా బలపరీక్ష కి రెడీ అయ్యి తమ బలాన్ని అసెంబ్లీ వేదికగా నిరూపించుకుంటే, రాబోయే రోజుల్లో పార్టీలో ఇలాంటివి జరిగే అవకాశం ఉండదని ఓ సీనియర్ నేత కుండబద్దలు కొడుతున్నారు.