రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు మొన్నటివరకు రసవత్తరంగా సాగాయి. పార్టీలో యువ నాయకుడు సచిన్ పైలెట్ సీఎం అశోక్ గెహ్లాట్ కు వ్యతిరేకంగా వ్యవహరించడం జరిగింది.
అంతేకాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు సచిన్ పైలెట్ వెనకాల చేరి పార్టీ నుండి బయటకు వెళ్లిపోవడం జరిగింది. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం గ్యారంటీ అని అందరూ భావించారు. మరోపక్క ఈ టైంలో అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి బీజేపీ రెడీ అయింది.
దీంతో అనేక గందరగోళాల మధ్య తాజాగా సచిన్ పైలెట్ సీఎం అశోక్ గెహ్లేట్ రాజీ పడటం తో రాజస్థాన్ సంక్షోభ రాజకీయ ఎపిసోడ్ ఒక్కసారిగా టర్న్ ఆఫ్ అయింది. మరోపక్క జరిగిందంతా మర్చిపోండి….జరగబోయే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి దిగుతున్న బీజేపీకి కాంగ్రెస్ దమ్ము ఏంటో చూపిస్తా అంటూ సీఎం అశోక్ చెప్పుకొచ్చారు. 19 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు లేకుండానే నేను మెజారిటీ నిరూపించుకుంటూ అంటూ చెప్పుకొచ్చారు.