ఏపిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా పునః నియామకం, మూడు రాజధానుల బిల్లు ఆమోదం.. వీటి దృష్టిలో పడి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రాజస్థాన్ రాజకీయాన్ని తెలుగు ప్రజలు పట్టించుకోవడం లేదు. రాజస్థాన్ లో ప్రస్తుతం అత్యంత నాటకీయమైన రాజకీయం కొనసాగుతోంది. అసెంబ్లీలో ప్రభుత్వం సీఎం అశోక్ గెహ్లాట్ బలనిరూపణకు మరి కొద్దిరోజులే గడువు ఉండటంతో ఏ వర్గానికి ఆ వర్గం తమ ఎమ్మెల్యేలను బంధించుకుంటూ, కాపాడుకుంటూ వస్తుంది. అక్కడి రోజు వారి పరిణామాలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. తాజా పరిణామాలను పరిశీలిస్తే…
విమానంలో క్యాంపుకు గెహ్లాట్ ఎమ్మెల్యేల తరలింపు
ముఖ్య మంత్రి అశోక్ గెహ్లాట్ బలనిరూపణకు రోజులు దగ్గర పడుతున్నాయి. అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలకు మరో 14 రోజుల సమయం ఉన్నది. కాంగ్రెస్ తిరుగుబాటు నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో ఒ రిసాట్స్ క్యాంపు ఏర్పాటు చేసుకోగా, సీఎం అశోక్ గెహ్లాట్ తన వర్గం ఎమ్మెల్యేలను అయిదు విమానాల్లో జైపుర్ నుంచి 550 కి.మీ దూరంలో ఉన్న జైసల్మేర్కు తరలించారు.
గెహ్లాట్ నోట ఏపి మాట
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్..ఏపి గురించి మాట్లాడటం ఏమిటిని అనుకుంటున్నారా? ఇందులో ఆశ్చర్యపోనవసం లేదు. రాజస్థాన్ లో ఆరుగురు బీఎస్పి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై బీజేపీ నేతలు గెహ్లాట్ లక్ష్యంగా విమర్శలు చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ‘మనం చేస్తే శృంగారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం’ అన్న అర్ధం వచ్చేలా గెహ్లాట్ కౌంటర్ ఇచ్చారు. గత ఏడాది ఏపికి చెందిన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో ఎలా విలీనం చేసుకున్నారు? అని గెహ్లాట్ ప్రశ్నించారు. బీజేపీ నేతల రాజకీయ క్రీడలను దేశం అంతా చూస్తోంది అని ట్వీట్ చేశారు.
కాగా సచిన్ పైలట్ వర్గ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనర్హత నోటీసులపై రాజస్థాన్ హైకోర్టు నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ విప్ మహేశ్ జోషి శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?