సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల రాజకీయాల్లోకి వస్తానని చెప్పి వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. దాదాపు పార్టీ పేరు మరియు సిద్ధాంతాలు ఖరారు అని అనుకున్న సమయంలో రజిని ఒక్కసారిగా అనారోగ్యానికి గురికావడంతో.. భగవంతునికి తాను రాజకీయాల్లోకి వెళ్ళటం ఇష్టం లేదని తెలుపుతూ.. పార్టీ పెట్టడం లేదని రాజకీయాల్లోకి రావడం లేదని మూడు పేజీల లెటర్ రజినీకాంత్ రాయడం అభిమానులకు నిరుత్సాహం కలిగించింది.
ఈ పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా అభిమాన సంఘాలు రజిని తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ గత కొన్ని రోజుల నుండి నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రజిని తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరుతూ రజిని ఇంటి ముట్టడి చేయడానికి ఇటీవల అభిమానులు ఒక్కసారిగా వెళ్ళటం తో పాటు ఒక అభిమాని తన పై పెట్రోల్ పోచుకుని నిప్పంటించి కోటానికి ప్రయత్నాలు కూడా చేసినట్టు దీంతో అక్కడే ఉన్న తమిళ మీడియా ఛానల్ లో ఒక్కసారిగా కంగారు పడినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ అంచనాలు రేకెత్తించి రజనీకాంత్ ఈ విధంగా రాజకీయాల్లోకి రాను అని ప్రకటించటం దారుణమని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
మరోపక్క తమిళ రాజకీయాలలో రజనీకాంత్ వచ్చినా పెద్దగా మార్పు ఉండదని.. గెలిచే అవకాశం ఉండదని నేతలు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాదిలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రజినీకాంత్ పోటీకి రాకపోవటం పట్ల తీవ్రస్థాయిలో అభిమానుల నుండి విమర్శలు వస్తున్నాయి. ఇది చాలా సరైన సమయమని.. రజిని దీన్ని మిస్ చేసుకుంటే ఇంకా కష్టమే అని అంటున్నారు.