చెన్నై, ఫిబ్రవరి 17: త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సూపర్స్టార్ రజనీకాంత్ ప్రకటించారు.
లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదనీ, ఏ రాజకీయ పార్టీకి మద్దతు కూడా ఇవ్వడం లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయనున్నట్లు రజనీకాంత్ వెల్లడించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తన అభిమాన సంఘాలు గానీ, ఇతర పార్టీ వర్గాలు కానీ ప్రచారం కోసం తన పేరు, ఫోటో వాడుకోవద్దని రజనీకాంత్ సూచించారు. తన పేరు, ఫోటో వాడుకుంటే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రజనీకాంత్ హెచ్చరించారు.
తమిళనాడుకు నీటి సమస్య లేకుండా చేసే పార్టీకే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయాలని రజనీకాంత్ పిలుపునిచ్చారు.
రజనీకాంత్ ఇప్పటి వరకూ తన పార్టీ పేరు కూడా ప్రకటించలేదు. ‘రజనీ మక్కల్ మండ్రమ్’ అనే అభిమాన సంఘం పేరుతోనే తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
లోక్సభ ఎన్నికల్లో రజనీకాంత్ పోటీ చేస్తారని తమిళనాట అభిమానులు ఎదురుచూశారు. ఆయన తాజా ప్రకటన అభిమానులకు నిరాశ కల్గించింది.