సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల రాజకీయాల్లోకి వస్తానని చెప్పి వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. అయితే రజనీకాంత్ తీసుకున్న నిర్ణయానికి ఎంతో మనస్తాపానికి గురైన అభిమానులు ఆందోళనలు శాంతి ర్యాలీలు నిర్వహిస్తూ నిర్ణయం మార్చుకోవాలని తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. అనారోగ్యం కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని యూటర్న్ తీసుకున్న రజనీకాంత్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు దానికి ఫ్యాన్స్ లబోదిబోమంటున్నట్లు తమిళనాడు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మేటర్ లోకి వెళ్తే అనారోగ్యం కారణంగా సినిమాలకు కూడా గుడ్ బై చెప్పే ఆలోచనలో రజినీ ఉన్నట్లు టాక్ వస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్న సమయంలో అనారోగ్యానికి గురైన రజనీకాంత్ హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయితే ఇటీవల డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. దీంతో రాజకీయాల నుండి వైదొలుగుతానని అట్లు రజిని ప్రకటించడం జరిగింది.
అయితే ప్రస్తుత పరిస్థితుల బట్టి సినిమాలకు కూడా పూర్తిగా బ్రేక్ ఇచ్చే ఆలోచన రజిని చేస్తున్నట్లు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే రజనీకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘అన్నాత్తే’ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఇంకా సినిమాలు చేయకూడదు అని ఆలోచన రజిని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ అయిన తర్వాత వెంటనే కుటుంబసమేతంగా రజినీకాంత్ కొన్నాళ్లపాటు అమెరికాలో ఉండేవిధంగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా టాక్ వస్తుంది.