వరసగా రాజకీయ నాయకులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులకు కరోనా సోకిన విషయం తెల్సిందే. రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ తాజాగా కరోనా బారిన పడ్డారు. ఈయనకు కరోనా సోకినట్లు స్వయంగా సామాజిక మాధ్యమంలో ప్రకటించారు.
నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే నా ఆరోగ్యం బాగానే ఉంది. వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్ లో ఉన్నాను. గత వారం రోజులుగా నాతో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు అందరూ కరోనా టెస్టులు చేయించుకోండని సీఎం రమేష్ సూచించారు. సీఎం రమేష్ కు కరోనా సోకడంపై ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల్లో మెసేజ్ లు పెడుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?