జగన్ ఒక్కసారిగా ఢిల్లీ వెళ్తున్నట్లు వచ్చిన వార్త ఏపీ రాజకీయాలను షేక్ చేసి పడేసింది. లాక్ డౌన్ తరువాత పైగా హైకోర్టులో వరుసగా వ్యతిరేక తీర్పులు వచ్చిన టైంలో జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అనేసరికి రాజకీయంగా ఏపీలో ఏదో జరుగుతుంది అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇంతలోనే జగన్ టూర్ క్యాన్సిల్ కావటంతో అసలు ఏపీ ఢిల్లీ రాజకీయాల మధ్య ఏం జరుగుతోంది అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది.
జగన్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అవ్వడానికి అసలు కారణం ఏమిటి ? కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అపాయింట్మెంట్ ఓకే అయిన తర్వాత ఇలా జరగటం ఏమిటి ? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమయ్యాయి. జగన్ ని ఢిల్లీ వెళ్లకుండా ఆపింది ఎవరు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇటువంటి టైం లో 48 గంటల తర్వాత ఏపీ రాజకీయాల్లో జగన్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అవటానికి బలమైన వ్యక్తి ఏపీ రాజకీయాలలో ఉన్న వ్యక్తే అన్న టాక్ వినబడుతోంది. అది కూడా వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు అని సదరు వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఢిల్లీలో వైయస్ జగన్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం జగన్ దాకా వెళ్లినట్లు కూడా వైసీపీ పార్టీలో టాక్.