దేశంలో ప్రముఖ సంస్థ రిలయన్స్ భారీ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ కొట్టేసింది. దాదాపు 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించడం జరిగింది. రిలయన్స్ సంస్థలకు చెందిన జియో ప్లాట్ ఫామ్స్ లో అబుదాబి కి చెందిన ముబాదాలా ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ రూ. 9,093.60 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ఇటీవల ప్రకటించడంతో రిలయన్స్ మార్కెట్ క్యాప్ అమాంతం ఒక్కసారిగా పెరిగింది.
ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు కంపెనీల నుండి జియో రూ. 87,655.35 కోట్టను సేకరించడంతో భారతీయ స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ షేర్ 2.39 % పెరిగింది. ఈ సందర్భంగా రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇన్వెస్టర్ ముబాదాలా రిలయన్స్ తో చేతులు కలపడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ రంగంలో భారత్ టాప్ పోజిషన్ లో ఉండేందుకు ఈ కలయిక ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు.