అమరావతి: ఇప్పటి వరకూ కేవలం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ వచ్చిన బిజెపి నాయకుడైన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తాజాగా మహఘట్ బంధన్ నాయకులపైనా ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
మహాఘట్ బంధన్ నాయకులు చాలా మంది మీద అవినీతి కేసులు నడుస్తున్నాయనీ, ఇదే వారందరినీ దగ్గరికి కలిపే గట్టి బంధం అని ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. వారి అందరి అజెండా మోదీ గెలవకూడదనీ, ఆయన గెలిస్తే వివిధ స్థాయిలలో ఉన్న అవినీతి కేసులు కొలిక్కి వస్తాయని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. లుటన్స్ మీడియా అదే రకమైన భయంతో వీరికి పూర్తి మద్దతు ఇస్తుందని ఐవైఆర్ విమర్శించారు.