చిత్తూరు: నగరి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే ఆర్కె రోజాకు ఆ పార్టీ నేతల నుండి చేతు అనుభవం ఎదురైంది. కెబిఆర్ పురం గ్రామంలోకి ఎమ్మెల్యే రోజా రాకుండా నేతలు అడ్డుకున్నారు. గ్రామ సచివాలయ భవన శంకుస్థాపనకు రోజా చేరుకోవడంతో గ్రామ వైసిపి నాయకులు కారుకు అడ్డంగా నిలబడి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన సొంత పార్టీ నాయకులను కాకుండా టిడిపి వారికి రోజా ప్రాధాన్యత ఇస్తున్నారని వైసిపి కార్యకర్తలు ఆరోపించారు. పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్థులకు సర్దిచెప్పడంతో రోజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
previous post
next post