ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల గొడవ రచ్చరచ్చగా మారింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి మరియు ప్రభుత్వానికి మధ్య నువ్వానేనా అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకరీతిలో ప్రభుత్వం పై చేయి సాధించినట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి.
న్యాయస్థానాల తీర్పు లన్ని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కి అనుకూలంగా రావడంతో.. మరోపక్క వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అనేక విమర్శలు ప్రతిపక్షాల నుండి వస్తున్నాయి. లోకల్ ఎన్నికలకి సీఎం జగన్ భయపడుతున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఇటీవల తిరుమల పర్యటన సందర్భంలో ప్రతిపక్షాలు పంచాయతీ ఎన్నికల విషయంలో సీఎం జగన్ పై చేసిన కామెంట్లకు కౌంటర్లు వేశారు. ఆమె మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలకు జగన్ భయపడరని…. ఉద్యోగులు, ప్రజల ప్రాణాలు ద్రుష్టిలో ఉంచుకుని ఎన్నికల వాయిదా వెయ్యమంటున్నారని…. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సుప్రింకోర్టు ఎన్నికలును వాయిదా వేస్తూందని భావిస్తూన్నామని అన్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎన్నికలు నిర్వహించాలని కోరితే కచ్చితంగా ఎన్నికలకు వెళ్తామని తెలిపారు.