చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ Roja తీరు మొదటి నుండి పేచి గానే ఉంది అనే చెప్పవచ్చు. మొదటిలో పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో ఆ తర్వాత డిప్యూటీ నారాయణస్వామి తో రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రోజాకి తాజాగా ఇప్పుడు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తో వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారినట్లు వార్తలొస్తున్నాయి.
ప్రోటోకాల్ పాటించకుండా కనీస మర్యాద ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నట్లు ఇటీవల శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా కన్నీళ్లు పెట్టుకోవడం అందరికీ తెలిసిందే. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కార్యక్రమాలు చేసేస్తున్నారు అంటూ రోజా ఇటీవల ఆరోపించడం జరిగింది.
నియోజకవర్గంలో దళితులకు కళ్యాణమండపం విషయంలో అదేవిధంగా ఇళ్ల పట్టాల విషయంలో కూడా ప్రభుత్వ అధికారుల నుండి రోజా కి ఎటువంటి సమాచారం రావడంలేదని తెగ అసంతృప్తి చెందుతూ ఉన్నారంట. పైగా నగరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన భూములు ఏపీఐఐసీ కి చెందినవి అయినా కలెక్టర్ రోజా ని సంప్రదించకుండా.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా చేయటంతో.. కలెక్టర్ పై ఫుల్ సీరియస్ గా ఉన్నారట ఎమ్మెల్యే రోజా. ఈ క్రమంలోనే ఇటీవల తిరుమల తిరుపతి పర్యటనలో కూడా రోజా ప్రభుత్వ అధికారులపై మడి పడటం జరిగింది.