Ukraine Russia War: ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ బీభత్సం ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో రష్యా చేస్తున్న దాడుల పట్ల ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఉక్రెయిన్ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇటువంటి తరుణంలో ప్రపంచ దేశాలు… ఇరుదేశాలు చర్చించుకుని సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు.
కానీ మరో పక్క ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలేన్ స్కి … యూరోపియన్ దేశాలతో కలిసిపోయి నాటో సభ్యత్వం తీసుకోవడానికి.. కీలక అడుగులు వేయడంతో పాటు యునైటెడ్ నేషన్స్ సభలో కూడా ఉక్రెయిన్ కి భారీగా మద్దతు రావడంతో పుతిన్.. తీవ్ర ఆగ్రహం తో ఉక్రెయిన్ దేశాన్ని నామరూపాలు లేకుండా దాడులకు పాల్పడటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పటికే ఉక్రెయిన్ దేశం లో ఇద్దరు భారత విద్యార్థులు మరణించడం జరిగింది. అయితే విద్యార్థుల మరణం పట్ల రష్యా అధికారులు విచారణ చేపడతామని అంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడికి ఫోన్ చేసినట్లు భారత విద్యార్థులను తరలించడానికి కొద్దిగా యుద్ధానికి గ్యాప్ ఇవ్వాలని.. కోరినట్లు దానికి పుట్టిన కూడా సరే అన్నట్లు సమాచారం. అంత మాత్రమే కాక సరిహద్దులలో ఉన్న భారతీయ విద్యార్థులు రష్యా భూభాగం నుండి ఇ స్వదేశానికి వచ్చే విధంగా సహకరించాలని కూడా రష్యా అధికారులను మోడీ కోరినట్లు దానికి.. రష్యా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీ నుండి ప్రత్యేక విమానాలు.. యూక్రేన్ లో చిక్కుకుపోయిన.. భారత పౌరులు తీసుకురావడానికి వెళ్ళినట్లు సమాచారం. హింసాత్మక ఘటనలు లక్ష్యంగా .. ఉక్రెయిన్ లో మరింత దాడి డోస్ రష్యా బలగాలు పెంచినట్లు టాక్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?