మాజీ ఎంపీ సబ్బం హరి ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ లో షాకింగ్ కామెంట్ చేశారు. వైసీపీ అధినేత జగన్ కేసులకు సంబంధించి తుది తీర్పు లు వచ్చే ఏడాదిలో కానీ మధ్యలో గాని వెలువడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా నాలుగు కేసులు బలంగా ఉన్నట్లు తనకి అందుతున్న సమాచారం అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరిలో గాని 2022లో స్టార్టింగ్ లో గాని దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. ఆ సమయానికి వైసీపీ ప్రభుత్వం లో సీఎం ప్లేస్ లో జగన్ ఉండకపోవచ్చు అనే విషయం తనకు తెలిసినట్లు టీవీ ఛానల్ లో పేర్కొన్నారు. ఒకవేళ జగన్ కి గనుక శిక్ష పడితే, ఆ తర్వాత సీఎం ఎవరు అనే ప్రశ్నలకు సబ్బం హరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో 151 ఎమ్మెల్యే లు కలిగి ఉన్న ఈ పార్టీని బిజెపి అస్తవ్యస్తం చేస్తుందని.. బిజెపి కనుసన్నల్లో వైసీపీ నేతలంతా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలో జయలలిత మరణం తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఏపీలో నెలకొంటాయని పేర్కొన్నారు. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని వెనక ఉండి బిజెపి నడిపిస్తుందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురై తనతో స్వయంగా చెప్పారని.. బిజెపి తమ పార్టీని శాసించడం పట్ల ఆయన బాధ పడ్డారు అని చెప్పుకొచ్చారు.
తమిళనాడులో అమలు చేసిన వ్యూహాన్ని ఏపీలో కూడా బీజేపీ అమలు చేస్తుందని తెలిపారు. ఏపీలో జగన్ జైలు కెళ్ళిన తరువాత వైసీపీ నుంచి ఎవరు సీఎం అయినా గాని బిజెపి చెప్పినట్లే మాట వినాల్సిన పరిస్థితి ఉంటుందని అంచనా వేశారు. ఇందువల్లే జగన్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లెటర్ రాయటం అదే లెటర్ బయట పెట్టడం… ఇది పెద్ద సంచలన స్కెచ్ అన్నట్టు చెప్పుకొచ్చారు. న్యాయస్థానాలు తనకు అన్యాయం చేశాయనే భావన పబ్లిక్ లో తీసుకురావటానికి.. ఇప్పటి నుండే జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు అందుకే ఆ భావన కలిగించడానికి లెటర్ రాసినట్లు సబ్బం హరి ఈ డిబేట్ లో తెలిపారు.