ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు…. ఇప్పుడు జగన్ ని టార్గెట్ చేసుకుని ముక్కుమ్మడిగా దాడి చేయటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్, నిన్న మాజీ ఎంపీ సబ్బంహరి తాజాగా హర్ష కుమార్ జగన్ ని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సబ్బంహరి, హర్ష కుమార్ ఇద్దరు చేసిన విమర్శల లో కామన్ పాయింట్ మూడు రాజధానులు విషయం.
సబ్బం హరి ఇటీవల విశాఖపట్నంలో జగన్ తీసుకువచ్చే రాజధానిని స్థానికులు ఇష్టపడటం లేదని స్పష్టం చేయటం మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా హర్షకుమార్ ఏపీ సీఎం జగన్ మోసగాడు అంటూ…. అమరావతి రాజధానిగా ఉంటుందని తాను అక్కడే ఇల్లు కట్టుకున్నానని ఎన్నికలకు ముందు ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల తర్వాత మోసం చేశారని పేర్కొన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో దళితుల పై వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాడులు ఎక్కువయ్యాయని.. అయినా సరే జగన్ కి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ కి దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని, ఎన్నికల్లో మెజారిటీ వస్తే అప్పుడు అమరావతిని మార్చుకోవచ్చు అని చాలెంజ్ చేశారు.