అక్టోబర్ 9వ తారీఖున నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల కి ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. 2016వ సంవత్సరంలో ఎన్నికైన భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో టిఆర్ఎస్ పార్టీ అనర్హత వేటు వేయటం జరిగింది. దీంతో ఇక్కడ తిరిగి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ముందుగా గుర్తొచ్చేది క్యాంపు రాజకీయాలు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటర్లు కావడంతో… ఇటువంటి ఎన్నికల సమయంలో ఆ లోకల్ లీడర్స్ ని ఆకర్షించుకోవడానికి ప్రధాన పార్టీలు తెగ డబ్బులు మరియు వాళ్ళు కోరిందల్లా ఇస్తూ ఉంటారు.
స్థానిక సంస్థల ఎన్నికలు అంటే స్థానిక ప్రజాప్రతినిధులకు పంట పండినట్లే. భారీ గిఫ్ట్ లతో, సకల సౌభాగ్యాలు వాళ్లు కోరిందల్లా ఓటు కోసం నెరవేర్చుకుంటారు. కానీ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు కేసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత విషయంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు హ్యాపీగా లేరట. పూర్తి విషయంలోకి వెళితే ఎక్కడ 824 మంది ప్రజాప్రతినిధులు ఉంటే అందులో రెండు వందల మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన వారు.
దీంతో ఇక్కడ ఎమ్మెల్సీగా నిలబడిన కవిత ఎన్నిక వన్ సైడ్ అయినట్టే. క్యాంపు రాజకీయాలకు ఏమాత్రం ఆస్కారం లేదు. మరోపక్క ఖర్చుపెట్టడానికి అంతా ఆ పరిస్థితి కూడా లేదు ..దీంతో కెసిఆర్ కూతురు ఏకగ్రీవం కావటంతో ఈ ఎన్నికలలో ఎలాంటి లాభం లేకపోవడంతో టిఆర్ఎస్ స్థానిక నేతలు కొద్దిగా నిరాశ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.