సిద్ధిపేట, జనవరి 21: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న తన ఫామ్ హౌస్లో మహరుద్ర సహిత సహస్ర చండీయాగంను సోమవారం ఉదయం ప్రాంభించారు. ఈ యాగం నేటి నుండి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో కెసిఆర్ దంపతులు గోపూజ, యాగశాల ప్రవేశం, గణపతి హోమం, పుణ్యహవచనం, దీక్షాధారణ, రుత్విక్వరణ కార్యక్రమాలతో యాగానికి అంకురార్పణ చేశారు.
శృంగేరి పీఠం సంప్రదాయ పద్ధతిలో ఆ పీఠ పండితులు ఫణి శశాంక శర్మ, గోపికృష్ణ శర్మ, తెలంగాణ పత్రిక సంపాదకుడు అష్టకాల రామ్మోహనశర్మల పర్యవేక్షణలో ఈ క్రతువులు ఫ్రారంభించారు. మూడు యాగశాలలు, 16 హోమ గుండాలు ఏర్పాటు చేశారు.300మంది రుత్వికులు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహమూద్ ఆలీ, టిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కెటి రామారావు దంపతులు, ఎంపి కవిత, హరీష్రావు దంపతులు. కె కేశవరావు దంపతులు కార్యక్రమానికి హజరైయ్యారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015 డిసెంబర్లో సిఎం కెసిఆర్ అయుత చండీ మహాయగాన్ని నిర్వహించారు. శాసనసభ ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?