టీడీపీ అధినేత చంద్రబాబు ని ఆయన తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ని ధీటుగా ఎదుర్కొంటుంది మన్సాస్ ప్రస్తుత సింహాచలం ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు. చంద్రబాబు, లోకేష్ నేరుగా రంగంలోకి దిగి తన పై చేస్తున్న ఆరోపణలకు దీటుగానే సంచయిత కౌంటర్లు ఇవ్వటం ఇప్పుడు ఏపీరాజకీయాలలో హైలైట్ గా మారింది. దీంతో టిడిపి జీర్ణించుకోలేకపోతోంది అని మీడియా వర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అతి చిన్న వయసులోనే ఈ రీతిలో సంచయిత రాజకీయాలు చేస్తున్న తరుణంలో, భవిష్యత్తులో టీడీపీకి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆమె పై కుట్ర చేయడానికి టిడిపి హైకమాండ్ రెడీ అవుతున్నట్లు సమాచారం. చంద్రబాబుకి ఆయన తనయుడికి నోటి మాట రాకుండా సంచయిత చేస్తున్నా కామెంట్లకు ధీటుగా ఆమెని…. ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్ట్ బోర్డుని, సింహాచలం ట్రస్ట్ పై టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా ఇప్పుడు తాజాగా అవినీతి బురద ఆమెపై వేయడానికి ప్రచారానికి తెగ పడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
సింహాచలం ట్రస్ట్ నిధులను చాలావరకు అక్రమంగా ట్రస్ట్ చైర్మన్ సభ్యులు వాడుతున్నట్లు , దుర్వినియోగం చేస్తున్నట్లు టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా వార్తలు వడి వారిస్తుంది అని ఆమె మద్దతుదారులు అంటున్నారు. మొన్నటి వరకు దేవాలయం పవిత్రత గురించి చెబుతూ సంచయిత గజపతిరాజు కి మతం అంటగట్టిన వాళ్ళు ఇప్పుడు అవినీతి అస్త్రాలు బయటకు తీసి…. ఆమెను ఏదో రీతిలో నవ్వులపాలు చేయాలని చూస్తున్నట్లు భావిస్తున్నరు. ఆమెపై స్థానికంగా వ్యతిరేకత తీసుకురావాలని టిడిపి హైకమాండ్ మరియు దాని అనుకూల మీడియా అనుకుంటున్నట్లు ఏపీ రాజకీయాలలో కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.
దీంతో సంచయిత గజపతిరాజు కి మద్దతు గా ఉండే వాళ్ళు సోషల్ మీడియాలో జాగ్రత్త తల్లి అంటూ ఆమెకు తాజా పరిణామాలపై సూచనలు ఇస్తున్నారు. మరోపక్క సంచయిత తనపై మరియు ట్రస్ట్ పై టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలను మరియు వాటిని ప్రసారం చేస్తున్న మీడియా ఛానల్స్ కి లీగల్ నోటీసులు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు… అందుకు సంబంధించి లాయర్లతో మంతనాలు కూడా జరుపుతున్నట్లు సమాచారం.