ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంకా పాతకాలంనాటి మనిషి లాగా ఆలోచిస్తూ కొత్త తరానికి చెందిన నాయకులకు చేస్తున్న విమర్శలు ఆయనని నవ్వులపాలు చేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే సంచయిత గజపతిరాజు విషయంలో మన్సాస్ ట్రస్ట్ బోర్డు పై చంద్రబాబు చేస్తున్న విమర్శలకు ఆమె వేస్తున్నా కౌంటర్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి.
మన్సాస్ ఉద్యోగస్తులకు జీతం ఇవ్వటం లేదని వాళ్ళంతా రోడ్డున పడ్డారు అంటూ మొన్న నారా లోకేష్ ట్విట్టర్ లో పెట్టిన కామెంట్ కు సంచయిత ఎవ్వరూ ఊహించని రేంజ్ లో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. సంచయిత పెట్టిన కామెంట్ కి లోకేష్ పరువు పోయినట్లు అటు నుంచి రెస్పాండ్ కూడా రాలేదు అని టాక్. లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ బాబు మన్సాస్ ట్రస్ట్ ఉద్యోగస్తుల జీతంపై చేస్తున్న ఆరోపణల విషయంలో సంచయిత అదరగొట్టే రీతిలో తిప్పి కొడుతున్నారు. గతంలో ఈ విషయంలో లోకేష్ కి ఇచ్చిన కౌంటర్ నె చంద్రబాబుకి తాజాగా సంచయిత ఇచ్చారు.
“మన్సాస్ పాచిపోయిన న్యూస్ ను పట్టుకొని లేనిపోని వార్తలు సృష్టిస్తున్నారు, చిన్న బాబు కి ఆల్రెడీ జవాబిచ్చాను దాన్ని కాపీ చేసి చూసుకోండి” అంటూ చంద్రబాబు తన ట్రస్ట్ పై చేస్తున్న ఆరోపణలకు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమ ట్రస్ట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేదని ఎవరు చెప్పారు. మా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి జీతాలు ఇచ్చాం, ఎప్పుడో వార్తను పట్టుకుని బురదజల్లుతారా అంటూ చంద్రబాబు ని సంచయిత చెడుగుడు ఆడేసుకున్నారు.
తన బాబాయి మరియు చంద్రబాబు హయాంలో మన్సాస్ ట్రస్ట్ చాలా దిగజారిపోయింది అంటూ కూడా కామెంట్లు చేసి బాబు పరువు తీసేసేటట్లు కౌంటర్లు వేశారు. దీంతో సంచయిత చేసిన కామెంట్లకు చంద్రబాబు యాంటీ ఫ్యాన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. పొలిటికల్ ఫీల్డ్ లో ప్రజెంట్ ఈ రీతిలో చంద్రబాబుకి ప్రత్యర్థులు కూడా…. ఇవ్వని రీతిలో అదిరిపోయే కౌంటర్ లు ఇచ్చారు అని సంచయిత గజపతి రాజు ని తెగ పొగుడుతూ చంద్రబాబు యాంటీ ఫాన్స్ అందరూ సంచయిత కి డై హార్డ్ ఫాన్స్ అయిపోతున్నారు.