మహమ్మారి కరోనా వైరస్ ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొనే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయినట్లు బిజెపి పార్టీ ముందు నుండి మాటల యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర బిజెపి నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వం పై మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి కేంద్రం వచ్చిన నిధులను తెలంగాణ సర్కార్ దారి మళ్ళించి ఉందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాగా వచ్చిన విమర్శలపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో తాజాగా స్పందించారు.
కరోనా వైరస్ నీ ఎదుర్కోటానికి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఏడు వేల కోట్లు ఇచ్చినట్లు గతంలో బీజేపీ నేతలు చెప్పారని కానీ తెలంగాణకు 200 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో తెలియజేసిందని సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు. మరి ఏడు వేల కోట్లు విడుదల చేస్తే 290 కోట్లు మాత్రమే కేంద్రం ఇవ్వటమేంటి అంటూ రివర్స్ గా కేటీఆర్ విమర్శల దాడి మొదలుపెట్టారు. 290 కోట్లు ఇచ్చి ఏడు వేల కోట్లు ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడాని తీవ్రంగా ఖండించారు.
అంతే కాకుండా ట్విట్టర్ లో నిధుల విడుదల పై కేంద్రం చేసిన ప్రకటన….., అదే విధంగా బండి సంజయ్ 7 వేల కోట్లు నిధులు ఏం చేశారు అని ప్రశ్నించడానికి సంబంధించిన ఓ పేపర్ క్లిప్పింగ్ కూడా షేర్ చేశారు. త్వరలో తెలంగాణ రాష్ట్రం లో స్థానిక ఎన్నికలు జరగనున్న తరుణంలో కరోనా వైరస్ ఈ విషయాన్ని అడ్డంపెట్టుకుని బీజేపీ నేతలు తెగ రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు కరోనా నిధుల విషయంలో క్లారిటీ ఇవ్వడం తో తెలంగాణ నడిబొడ్డులో కేటీఆర్ కి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అడ్డంగా దొరికినట్లయింది అని మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.