ఢిల్లీ, జనవరి 18: ప్రస్తుతం నెట్లో హల్చల్ చేస్తున్న #10 year challengeను ఉపయోగించుకుని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బిజెపిపై వ్యంగాస్త్రం సంధించారు. గత పదేళ్లలో సెలబ్రిటీలు సాధించిన ప్రగతిని చూపించడం కోసం 2009 నాటి ఫొటో, 2019 నాటి ఫొటో పక్కపక్క పెట్టడం #10 years challenge.
గత పది సంవత్సరాలలో భారతీయ జనతాపార్టీ సాధించిన ప్రగతిని చూపిస్తూ అప్పటి పార్టీ కేంద్ర కార్యాలయం, ఇటీవల ప్రారంభించిన కొత్త కార్యాలయం ఫొటోలను శశి థరూర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. అంతటితో ఆగలేదు. ఆయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణం కోసం సేకరించిన రాళ్ళు పది సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలానే ఉన్నాయని చూపిస్తూ మరే రెండు ఫొటోలు పోస్టు చేశారు. పదేళ్లలో రామజన్మభూమి వివాదాన్ని అడ్డు పెట్టుకుని బిజెపి ఎదిగిందనీ, అధికారం కోసం తప్ప బిజెపికి రామజన్మభూమిపై ఉన్నది నిజమైన భక్తి కాదనీ శశి థరూర్ ఒక్క వ్యాఖ్య చేయకుండానే చెప్పారు.
previous post