KTR fire on BJP: గత కొద్ది కాలం నుండి మంత్రి కేటీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలలో చాలావరకు కేటీఆర్ బీజేపీని గట్టిగా టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సమయంలో మీడియాలో కూడా… అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ గాలి తీసేసే తరహాలో సెటైర్లు వేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ .. ఇండియా ఇంకా పేద దేశమే అంటూ.. బీజేపీ నీ పరోక్షంగా ఉతికారేశారు. ఎవరు ఒప్పుకున్నా… ఒప్పుకోకపోయినా ఇండియా ఇంకా పేద దేశమే. 87 లో చైనా ఇండియా సమానంగా… ఉండేవి. కానీ నేడు చైనా మనకంటే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయింది. ఇండియా కంటే ఐదు రెట్ల ముందు చైనా అభివృద్ధి చెందుతూ ఉంది… ప్రపంచంలోని అగ్రదేశం అమెరికా తో పోటీ పడుతుంది. ఇంకా మన దేశ పరిస్థితి చూస్తే… పక్కన ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి వాటితో పోటీ. మనకి ఇంకా సిగ్గు రాదా..? దేశాన్ని అభివృద్ధి లో తీసుకెళ్లాలి అన్న ఆలోచన ఉండదా..?. ఎంత సేపు పక్కన ఉన్న వారిని కించపరచడం. బురదజల్లే రీతిలో వ్యవహరించడం. వాడిదే కులం..? వాడిదే మతం..? వాడు ఎక్కడోడు..?.. ఆడు ఏమంటున్నాడు..? ఏమి తింటున్నాడు..? ఏం వేసుకుంటున్నాడు..? ఇదేనా.. అంటూ పరోక్షంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీపై తనదైన శైలిలో కేటీఆర్ రెచ్చిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత.. తెలంగాణకు సంబంధించి కేటాయింపుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని.. అప్పటినుండి ఇ టిఆర్ఎస్ పార్టీ నేతలు చాలావరకు బీజేపీనే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఎక్కువగా మంత్రి కేటీఆర్… దేశంలో ఉన్న పరిస్థితులను ఉద్దేశించి బీజేపీ పై పరోక్షంగా ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్నారు.