ఢిల్లీ, జనవరి 21: తెలంగాణ పంచాయితీ రాజ్ ఆర్ఢినెన్స్పై బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీకోర్టు సోమవారం కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ రిజర్వేషన్లను కుదిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్ష్ను రద్దు చేయాలని కృష్ణయ్య అత్యున్నత న్యాయస్ధానంలో పిటిషన్ దాఖలు చేశారు.
పంచాయితీరాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 16న ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. దీనిలో బిసి రిజర్వేషన్లను 34శాతం నుండి 22 శాతానికి తగ్గించారు.
సుప్రీం కోర్టు రిజర్వేషన్లు 50శాతం నిబంధనలను మించలేదని తెలిపింది. నిబంధనలకు అనుగుణంగానే ఆర్దినెన్స్ ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
previous post
next post