రాజకీయంగా టిడిపి పార్టీకి గడ్డు కాలం అన్నట్టు పరిస్థితులు మారాయి. 2019 ఎన్నికలలో ఘోర ఓటమి పాలైన టిడిపి ప్రస్తుతం వరుస కుంభకోణాలు కేరాఫ్ అడ్రస్ అన్నట్టు ఏపీలో పరిస్థితి నెలకొంది. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ నెట్ ఇంకా అనేక కుంభకోణాలు టిడిపి హయాంలో జరిగినట్లు ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పరిస్థితులు ఇలా ఉండగా టిడిపి పార్టీలోనే అంతర్గతంగా స్కాం జరిగినట్లు వార్తలు సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి.
పూర్తి విషయంలోకి వెళితే 2019 ఎన్నికల సమయంలో పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీ తరఫున పోటీ చేసే క్యాండెట్ కి ఇచ్చే ఎన్నికల ఖర్చు విషయంలో ఓ బడా నేత టిడిపి నాయకులను మోసం చేసినట్లు కోట్లకు కోట్లు కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే గత సార్వత్రిక ఎన్నికలలో వైసిపిని చిత్తుచిత్తుగా ఓడించాలని పార్టీ అధిష్టానమే చాలావరకు నిలబడే పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు స్వయంగా పెట్టుకున్నట్లు టాక్.
దీంతో ఒక్కొక్క నియోజకవర్గానికి 25 కోట్లు చొప్పున పార్టీ అధిష్టానం ఇచ్చినట్లు నాయకుల మధ్య అప్పట్లో చర్చ నడిచింది. ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు రిజర్వుడ్ నియోజక వర్గాలకు ఇదే రీతిలో డబ్బులు కేటాయిస్తే స్థానికంగా బలంగా ఉన్న ఓ నాయకుడు నిధుల విషయంలో అన్నీ తానే వ్యవహరించి… అధిష్టానం నుండి నిధులు తీసుకువస్తానని మీరు ఎక్కడ ప్రచార ఖర్చుకు వెనకాడవద్దు….ముందు చేతిలో ఉన్న డబ్బు ఖర్చు పెట్టండి ప్రతి పైసాను ఇప్పిస్తానని నియోజకవర్గ అభ్యర్థులకు హామీ ఇచ్చారట. దీంతో నాయకులు చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చుపెట్టే ఇక ఎన్నికల వైసిపి భారీ స్థాయిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
పరిస్థితి ఇలా ఉండగా ఈ నాలుగు వర్గాలు అభ్యర్థులు ఖర్చు పెట్టిన డబ్బు ఇంకా ఆ బడా నేత ఇవ్వలేదట. దీంతో ఆ నేతలు అతని ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు…, అప్పులు చేసి మరీ ఎన్నికలకు ఖర్చుపెట్టినట్లు తెలిపారట. అయినా కానీ అతని నుండి సరైన స్పందన రావడం లేదని….పైగా ఈ విషయంలో నాకు సంబంధం లేదు ఏదైనా ఉంటే అధిష్టానంతో మాట్లాడుకోవాలని అంటున్నారట.
అయితే ఇదే విషయాన్ని అధిష్టానం వద్ద ప్రస్తావించగా నిధులు ఎప్పుడో ఇచ్చేసాము అని సమాధానం వచ్చిందట. దీంతో ఎన్నికలకు ఖర్చుపెట్టిన స్థానిక నాయకులు లబోదిబోమంటున్నట్లూ.. మోసపోయామని డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో అంటూ ఆ నేతలు తెగ విమర్శలు చేస్తున్నారట. ఇదిలా ఉండగా వస్తున్న ఈ వార్తల్లో వాస్తవం లేదని కావాలని టిడిపి నీ నిర్వీర్యం చేయడానికి ప్రత్యర్థులు కల్పించిన పుకార్లు అని పార్టీ నాయకులు ఖండిస్తున్నట్లు..మరోపక్క వార్తలు వస్తున్నాయి.