పెద్దల సభగా పిలవబడే శాసనమండలిలో చాలావరకు సూచనలకు సలహాలకు బదులు రాజకీయాలు చేయటంతో అధికారంలో ఉన్న జగన్ పెద్దల సభ రద్దు చేయటానికి అప్పట్లో చాలా ప్రయత్నాలు చేశారు. దానికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం వద్దకు కూడా బిల్లును పంపించడం జరిగింది. అయితే మధ్యలో కరోనా వైరస్ రావడంతో చాలావరకు దేశంలో పరిస్థితులు అన్నీ మారిపోవడంతో పార్లమెంట్ సభలు కూడా సరిగ్గా జరగని పరిస్థితి నెలకొంది. అయితే మరి కొద్ది నెలల్లో శాసనమండలిలో టిడిపి మెజార్టీ తగ్గిపోవటంతో పాటు వైసీపీకి భారీస్థాయిలో ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే అవకాశం ఉండటంతో వైకాపాలో ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ సీట్లు హాట్ హాట్ కేకుల్లా గా ఇతరులకు కేటాయిస్తున్నారట.
గతంలో జగన్ పార్టీ కోసం పని చేసిన వారికి ఈ ఎమ్మెల్సీ స్థానాలు కట్టబెట్టడానికి రెడీ అవుతున్నట్లు పార్టీలో టాక్. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ స్థానం విషయంలో…. ఎన్నికల కమిషన్ మోపిదేవి స్థానానికి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. పూర్తిగా ఈ స్థానం వైసీపీ పార్టీకి కావడంతో…..జగన్ ఎవరికి ఈ స్థానాన్ని కట్టబెడతారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మరోపక్క వచ్చే జనవరి మాసం కల్లా శాసనమండలిలో పూర్తిగా వైసీపీ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం ఉండటంతో, గతంలో జగన్ పాదయాత్ర సమయంలో అదేవిధంగా సీట్ల సర్దుబాటు టైంలో ఎవరికైతే మాట ఇచ్చారో వారికి ఈ ఎమ్మెల్సీ పదవుల కట్టబెట్టడానికి ఇప్పటినుండే జగన్ రెడీ అయినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.