విజయవాడ, జనవరి 8: రాబోయే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. సిపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మంగళవారం జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకొని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నాదెండ్ల మనోహర్తో చర్చలు ప్రారంభించారు.
ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో మినహా ఏ పార్టీతో తాము జతకట్టబోమని ఇటీవల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దీంతో వామపక్షాల నేతలు సీట్ల సర్దుబాటు అంశాలపై చర్చించేందుకు జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు. వారు ఆశిస్తున్న స్థానాలకు సంబంధించి జాబితాను నాదెండ్ల మనోహర్కు అందజేశారు. తమకు ఎక్కువ మద్దతు ఉన్న కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం, ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎక్కువ స్థానాలు అడుగుతున్నట్లు సమాచారం.
పార్టీ అధినేత పవన్కల్యాణ్తో చర్చించి సీట్ల సర్దుబాటు అంశాలను త్వరితగతిన ఫైనల్ చేస్తామని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ చెప్పినట్లు తెలుస్తుంది.
previous post