ఢిల్లీ: ఒక వైపు ఎన్నికల ప్రచారం మరోవైపు చేరికలతో బిజెపి జోష్ మీద ఉన్నది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, అధికారులు బిజెపిలో చేరగా వారిలో కొందరు ఎన్నికల బరిలో కూడా నిలిచారు.
కాగా శనివారం ఏడుగురు మాజీ సైనిక అధికారులు బిజెపిలో చేరారు. బిజెపి ప్రధాన కార్యాలయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు.
లెఫ్టినెంట్ జనరల్ జేబిఎస్ యాదవ్, లెఫ్టినెంట్ జనరల్ ఆర్.ఎన్.సింగ్, లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే పట్యాల్, లెఫ్టినెంట్ జనరల్ సునిత్ కుమార్, లెఫ్టినెంట్ జనరల్ నితిన్ కోహ్లి, కల్నల్ ఆర్.కె.త్రిపాఠి, వింగ్ కమాండర్ నవనీత్ మగాన్లు బిజెపిలో చేరిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..భారత సాయుధ దళాల్లో వీరు చేసిన సేవలను కొనియాడారు. వీరి చేరిక పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?