లాక్ డౌన్ టైములో వలస కార్మికులకు చేసిన సహాయం తో దేశవ్యాప్తంగా సోనూసూద్ పెద్ద చర్చనీయాంశంగా మారారు. చాలామంది ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ప్రభుత్వాలకు విరాళాలు మరోపక్క పేదలకు ఉచితంగా ఆహారాలు పంపిణీ చేయడం జరిగింది. కానీ సోనూసూద్ మాత్రం లాక్ డౌన్ వల్ల ఎంతోమంది వలస కార్మికులకు బస్సులు, ప్రత్యేకమైన రైళ్లు అదేవిధంగా స్పెషల్ ఫ్లైట్లు పెట్టి వాళ్లను గమ్యస్థానానికి చేర్చడం జరిగింది. దీంతో సోను సూద్ చాలా మంచి మనసున్న మనిషి అని చాలా మంది ప్రముఖులు ఆయన చేసిన సహాయం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇలాంటి సమయంలో శివసేన పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రౌత్ మాత్రం తీవ్ర విమర్శలు చేసారు. ఆయన త్వరలోనే ప్రధాని మోదీని కలిసి… ‘సెలెబ్రిటీ మేనేజర్ ఆఫ్ ముంబై’ గా అయిపోతారని సామ్నాలో రౌత్ ఆరోపణలు చేసారు. కొత్త మహాత్ముడు ఊడిపడ్డాడు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా అనేక విమర్శలు చేసిన ఆయన అసలు లాక్ డౌన్ టైం లో అన్ని బస్సులు సోనుసూద్ కి ఎలా లభించాయ్యో ఎవరూ అడగలేదని ఆయన వెనకాల ఏదో పొలిటికల్ పార్టీ ఉందని ఆరోపించారు. దీంతో నెటిజన్లు సదరు శివసేన ఎంపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
సహాయం చేస్తున్న మనుషులను అభినందించాలి గాని ఈ విధంగా అనుమానించడం ఏంట్రా బాబు అంటూ నాటు భాషలో గట్టి కౌంటర్ లు వేస్తున్నారు. మరో పక్క వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడవకండి మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం వల్ల చాలా మంది చనిపోతున్నారు ముందు మీ ప్రజలపై దృష్టి పెట్టండి అంటూ గట్టిగా కౌంటర్లు వేస్తున్నారు. ప్రజలను కాపాడుతున్న పోలీసులను కూడా కాపాడలేని శివసేన ఇతరులపై విమర్శలు చేయడం మంచిది కాదని మరికొంతమంది చురకలు అంటిస్తున్నారు.