Babri Masjid demolition: హిందూత్వ ఎజెండానే కలిగి ఉన్న ఆ రెండు పార్టీలు మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందడానికి ముప్పై ఏళ్ల క్రితం జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను నిస్సిగ్గుగా వాడుకుంటున్నాయి.బాబ్రీ మసీదును మేమంటే మేం కూల్చేశామని బహిరంగ ప్రకటనలు చేసుకునే వరకు ఆ రెండు పార్టీలు వెళ్లాయి.మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన,పూర్వ వైభవాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తున్న బిజెపి ల మధ్య ఇప్పుడు బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన ఎన్నికల ప్రచార అస్త్రంగా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
Babri Masjid demolition: బీజేపీని కెలికిన శివసేన!
గత నెలలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ హిందూత్వ గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేసే బిజెపి నేతలు బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఎక్కడున్నారని సూటిగా ప్రశ్నించారు.ఆ సమయంలో వారు కలుగులో ఎలుకల మాదిరి దాక్కున్నారని కూడా వ్యాఖ్యానించారు. అయినా ఇప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతున్నది సుప్రీంకోర్టు తీర్పు కారణంగానే అని,అదేమీ బీజేపీ విజయం కాదని కూడా సీఎం ఉద్దవ్ థాకరే ఆ సభలో ప్రకటించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
సీఎం కు దీటుగా మాజీ సీఎం సమాధానం!
దీంతో మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రెచ్చిపోయారు.ఉద్దవ్ థాకరే కు దీటైన సమాధానం ఇచ్చారు.”ఎవరో కాదు నేనే బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న కరసేవకులలో ఆరోజున ఉన్నాను.నా చేతులతోనే ఇటుకలు తీసేశాను.అంతేకాదు అక్కడ కరసేవ చేసినందుకు పధ్ధెనిమిది రోజుల పాటు నన్ను బదాన్ జైల్లో కూడా పెట్టారు.కావాలంటే ఆ రికార్డులను ఎవ్వరైనా చూసుకోవచ్చు” అని ఫడ్నవిస్ ఒక ఎన్నికల ప్రచార సభలో పేర్కొన్నారు.బిజెపి అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషి,ఉమా భారతి,వినయ్ కతియార్,సాధ్వి రీతాంబరి,కల్యాణ్ సింగ్ బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న విషయం దేశం మొత్తానికి తెలుసు అని కూడా ఫడ్నవీస్ ఉద్ఘాటించారు.అసలు ఆ రోజున శివసేన నాయకులు ఎవ్వరు బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్నారో చెప్పాలని ఆయన ప్రతి సవాల్ విసిరారు.మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని కోరితే వణికిపోయిన శివసేన నాయకులా బాబ్రీ మసీదు కూల్చివేత గురించి, అందులో బీజేపీ పాత్ర గురించి మాట్లాడేది అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
సీబీఐ డెయిరీ చూసుకోండి!
ఫడ్నవీస్ వ్యాఖ్యలపై శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పందిస్తూ ఆ రోజున ఎవ్వరు పాల్గొన్నదీ సీబీఐ డెయిరీలో ఉంటుందని, దాని చూసుకోవాలన్నారు.బాబ్రీ మసీదు కూల్చివేతలో శివసేన పాల్గొన్నదీ లేనిది సీబీఐ రికార్డ్స్ లో ఉంటుందని,మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు ఆ మాత్రం తెలియకపోవటం విచారకరం అని సంజయ్ రౌత్ కౌంటర్ వేశారు.అయినా ఎవ్వరేమిటో మహరాష్ట్ర ప్రజలకు తెలుసునని,బిజెపి ప్రగల్భాలను వారు నమ్మబోరని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు.