మనదేశంలో ఇంకా కరోనా కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలో ఇంకా ఈ మహమ్మారి విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. పలువురు ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ ప్రజాప్రతినిధులను వెంటాడుతూనే ఉంది. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, అందులోనూ ఉమ్మడి జిల్లాకు చెందిన వారు కావడం చర్చకు దారి తీసింది.
పాలమూరు ఎంపీకి కరోనా
నాగర్ కర్నూల్ టీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. తనను కలిసిన నేతలు, నాయకులు, ప్రజలు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఇక నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి కూడా కరోనా బారినపడ్డారు.. గత రెండు రోజులుగా ఆయన స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు ఎమ్మెల్యే.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని సూచించిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి.. గత వారం రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్ట్లు చేయించుకోవాల్సింది విజ్ఞప్తి చేశారు.
టీఆర్ఎస్లో చాలా మందికి…
టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే పలువురు కరోనా బారిన పడ్డారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, హైదరాబాద్ మేయర్ ఇలా.. చాలా మంది ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డారు.. వీరిలో పలువురు ఇప్పటికే పూర్తిస్థాయిలో కోలుకున్నారు.