రాజకీయాల్లో కొందరి గురించి హాట్ హాట్ చర్చ జరుగుతుంది. అలా జరిగిన సమయంలో వారి క్రేజ్ తారాస్థాయిలో ఉంటుంది. కానీ తర్వాత హఠాత్తుగా వారు ఆ అంచనాలు తలకిందులు చేస్తుంటారు.
కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి గురించి ఇదే విశ్లేషణ జరుగుతోంది. పార్టీ మార్పుపై గత కొంతకాలంగా చర్చ హాట్హాట్గా సాగుతోంది. అయితే, అది ఏటూ తేలకపోవడంతో….ఇప్పుడు ఇంకో డిస్కషన్ జరుగుతోంది.
రాములమ్మ…ఇదేంటమ్మా?
ఇటు రాజకీయాలు అటు సినిమాల్లో బిజీగా ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు కొద్దికాలంగా దూరంగా ఉంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన రాములమ్మ ఆ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సినిమాలో నటించారు. ఇక, వరుస సినిమాలు చేస్తారనే చర్చ సాగినా.. ఆమె మాత్రం అంగీకరించలేదు. అయితే, గత కొంతకాలంగా వరుసగా ఆమెను బీజేపీ నేతలు కలవడం పార్టీలోకి ఆహ్వానించారనే టాక్ వినిపించింది. ఇది సాధారణ భేటీగానే కొందరు వ్యాఖ్యానించగా… కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమె పార్టీలోనే కొనసాగుతారని చెబుతూ వస్తున్నారు. ఆమె ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారని టాక్ నడిచింది.. ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన నడ్డాను ఆమె కలిశారని.. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని గుసగుసలు వినిపించాయి.
ఆఖరికి….ఇలా?
బీజేపీలో చేరడంపై రాములమ్మ కేంద్రంగా జరుగుతున్న చర్చలకు ఫుల్ స్టాఫ్ పడలేదు. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఆమె కాషాయం కలర్లో ఉన్న మాస్క్తో దర్శనమిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీజేపీలో చేరడం లేటు అయినప్పటికీ , తాను బీజేపీలో చేరడం ఖాయం అని సిగ్నల్ ఇచ్చిందని కామెంట్ చేస్తున్నారు. రాములమ్మ పొలిటికల్ జర్నీ విషయంలో ఎందుకు? ఏమిటి ? ఎలా అనే ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు వస్తుందో మరి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?