SP Balasubrahmanyam గత ఏడాది సెప్టెంబర్ మాసంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం చెన్నై లో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. గాన గంధర్వుడు అనే బిరుదు కలిగిన బాలసుబ్రహ్మణ్యం మరణవార్త విని తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాక భారతీయ సంగీత ప్రేమికులు ఎంతగానో బాధ పడ్డారు. ఇదిలాఉంటే అప్పట్లో SP Balasubrahmanyam కి భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్రానికి జగన్ లెటర్ రాయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చేత నడిపించబడిన సంగీత పాఠశాలకి ఆయన పేరు పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
అదే టైంలో ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ ప్రత్యేకంగా సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించడం జరిగింది. ఏడుగురికి పద్మవిభూషణ్, 102 మందికి పద్మశ్రీ, పది మందికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించింది. ఈ క్రమంలో దివంగత ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కి పద్మవిభూషన్ అవార్డు ను కేంద్రం ప్రకటించడం సంచలనం అయింది.
ఈ వార్త తెలుసుకుని ఎస్పీ బాలు అభిమానులు అదేవిధంగా సంగీత ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఖచ్చితం ఈ అవార్డుకు అర్హుడు అంటూ కొనియాడుతున్నారు. తెలుగువాడైన బాలసుబ్రహ్మణ్యం కొన్ని దశాబ్దాల కాలం తన పాటలతో అనేక భాషలలో ఉన్న సంగీత ప్రేమికులను అలరించడం జరిగింది. చిత్ర పరిశ్రమకు ఎంతో కీర్తి కూడా తెచ్చి పెట్టారు. అటువంటి ఎస్పీ బాలసుబ్రమణ్యం కి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించడం నిజంగా సంతోషించదగ్గ విషయం అనే సంగీత కళాకారులు వ్యాఖ్యానిస్తున్నారు.