YS Jagan: 2021 స్కోచ్ ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో వైయస్ జగన్ అందిస్తున్న పాలనకి మంచి మార్కులు పడుతున్నాయి. పరిపాలన అనుభవం పెద్దగా లేకపోయినా గాని మొదటిసారి ముఖ్యమంత్రి అయినా గాని… జగన్ తల పండిపోయిన రాజకీయ నేతలను ముఖ్యమంత్రులను వెనక్కి నెట్టి అద్భుతమైన స్థానాలు రాబడుతున్నారు. ఏపీలో జగన్ అందిస్తున్న పాలన పట్ల… ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వ దృష్టిలో అదే విధం గా పేరుగాంచిన ప్రముఖ మ్యాగజైన్ లలో.. మాత్రం ఫలితాలు కళ్ళు చెదిరే రీతిలో వస్తున్నాయి. ఇటీవలే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విజయవాడ కి వచ్చిన సమయంలో రోడ్డు ప్రారంభం కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది.
ఇప్పుడు ఇదే రీతిలో దేశంలోనే పేరుగాంచిన స్కోచ్ ర్యాంకులలో మరోసారి రుజువయ్యింది. 2021 స్కోచ్ ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా రెండోసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రావటం గమనార్హం. వ్యవసాయం, బిజినెస్, పవర్ అండ్ ఎనర్జీ, ఈజ్ ఆఫ్ డూయింగ్, సామాజిక న్యాయం, నీటి సదుపాయం మొదలగు అంశాలను ప్రామాణికంగా తీసుకుని స్కోచ్ సంస్థ చేపట్టిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో పాలన అద్భుతంగా ఉందని ఫస్ట్ ర్యాంక్ అందించడం జరిగింది. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, మూడో స్థానంలో ఒడిశా, నాలుగో స్థానంలో గుజరాత్, ఐదో స్థానంలో మహారాష్ట్ర, ఆరో స్థానంలో తెలంగాణ, ఏడో స్థానంలో ఉత్తరప్రదేశ్, 8వ స్థానంలో మధ్యప్రదేశ్ స్కోచ్ గవర్నెన్స్ అవార్డులలో నిలిచాయి.
వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, పోలీసు రక్షణలో ఫస్ట్ ర్యాంక్ లో ఏపీ నిలిచింది. జిల్లాల పరిపాలనలో కూడా మొదటి స్థానం దక్కింది. ఈ గవర్నెన్స్ లో రెండో స్థానం.. ట్రాన్స్ పోర్ట్ విభాగంలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో పాలన అద్భుతంగా ఉన్నట్లు స్కోచ్ పేర్కొంది. ఏది ఏమైనా రాష్ట్రంలో ప్రతి పక్షాలు వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నాశనమై పోయిందని. చేస్తున్న విమర్శలకు కేంద్ర మరియు ప్రముఖ పేరుగాంచిన మ్యాగజైన్ సంస్థలు చేపడుతున్న సర్వేలలో వస్తున్న ఫలితాలకు సంబంధం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నట్లు స్కోచ్ సంస్థ చేపట్టిన సర్వేలో వచ్చిన ఫలితాలు బట్టి రుజువయింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?