(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కాంగ్రెస్ పాలన కింద ఉన్న ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీనీ ఇబ్బంది పెట్టాలని చూశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు సరికదా ఎదురుతిరిగింది. ఆరవ దశ ఎన్నికలకు వెళ్లనున్న మధ్యప్రదేశ్లోని అశోక్నగర్లో బుధవారం ఒక ఎన్నికల ప్రచారసభలో ఆమె ప్రసంగిస్తూ, రాహుల్ గాంధీ గత శాసనసభ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన రుణమాఫీ మీకు అందిందా అని ప్రశ్నించారు.
అక్కడ ఉన్న జనం పెద్ద ఎత్తున అందింది అని బదులిచ్చారు. మళ్లీ రెండవసారి కూడా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆఖరికి ప్రజలు కూడా వారి అబద్ధాలను ఎండగడుతున్నారు అని ఆ వీడియోకు శీర్షిక ఇచ్చారు.
స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్లోనిన అమేఠీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్నారు, క్రితం సారి ఆమె అక్కడ పరాజయం పాలయ్యారు. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ రుణమాఫీ వాగ్దానంతో విజయం సాధించింది.
स्मृति ईरानी की हुई किरकिरी :
स्मृति ईरानी ने मप्र के अशोकनगर में मंच से पूछा क्या किसानों का कर्जा माफ हुआ है ? तो सभा के बीच में किसानों ने चिल्ला कर बताया “हां हुआ है, हां हुआ है, हाँ हो गया है”।
—अब जनता भी इन झूठों को सीधे जवाब देने लगी है।
“अब तो झूठ फैलाने से बाज़ आओ” pic.twitter.com/N9g64K7xAC
— MP Congress (@INCMP) May 8, 2019