ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవి సోము వీర్రాజు చేపట్టిన తర్వాత, రాష్ట్రంలో బిజెపి పార్టీ సౌండ్ డబుల్, ట్రిపుల్ అవుతుంది. అంతకుముందు పార్టీ ఉన్నాగాని ఆటలో అరటిపండు మాదిరిగా ఏ గాలికి ఆగాలి అన్నట్టుగా పేరుకు మాత్రం ఏపీలో బీజేపీ ఉండేది. కానీ సోము వీర్రాజు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బిజెపి పార్టీకి ఏపీలో గతంలో ఎటువంటి బలం, ఏఏ వర్గాల్లో ఉందో అన్నిటినీ క్షుణ్ణంగా బేరీజు లెక్కలు వేసుకుని… దానికనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలో కోవర్టులు గా ఉండే వారిపై చర్యలు తీసుకుంటూ వస్తున్నారు.
అధ్యక్షుడు అయ్యి నెలరోజులు కాకముందే పార్టీలో ముగ్గురిని సోము వీర్రాజు సస్పెండ్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఎలాంటి రాజకీయ నేత అయినా సరే పార్టీ స్టాండ్, లైన్ దాట కూడదు అని సోము వీర్రాజు తనదైన శైలిలో స్పష్టం చేశారు. మరో పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ పార్టీ పరిస్థితి చూస్తే చాలా వరకు క్లైమాక్స్ కి చేరటంతో ముందు ప్రతిపక్ష స్థానాన్ని రీప్లేస్ చేయాలని సోము వీర్రాజు పార్టీలో భారీ యాక్షన్ స్పెషల్ టీమ్ నీ సిద్ధం చేసినట్లు సమాచారం. అంతే కాకుండా టిడిపి పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండే బిసి వర్గాలను ఆకట్టుకోవడానికి బిజెపి సరికొత్త ఎత్తుగడ వేయబోతున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి.
అదే రీతిలో ఏపీలో లో కీలక ఓటు బ్యాంకుగా ఉండే కాపు ఓటు బ్యాంకు ని…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కొల్లగొట్టడానికి రెడీ అయిందట. మొత్తానికి చూసుకుంటే ఏపీ నూతన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో… బిజెపి పార్టీ తీరుతెన్నులు పూర్తిగా మారిపో బోతున్నట్లు టాక్. దీంతో ఈ ఎత్తుగడలతో ఏపీలో సరికొత్త రాజకీయ పరిణామం క్రియేట్ అయ్యే అవకాశం ఉందని మేధావులు అంటున్నారు. గతంలో కాపులు, బీసీలు ఎక్కువగా టీడీపీకి అండగా ఉండటం జరిగింది. అయితే ఈ రెండు వర్గాల పై బీజేపీ ఇప్పుడు పట్టు సాధించాలని అనుకోవటం నిజంగా ఏపీలో సరికొత్త రాజకీయ ముఖచిత్రం ఏర్పడనుందని మేధావులు భావిస్తున్నారు.