ఏదో రకంగా చంద్రబాబు బీజేపీతో కాంప్రమైజ్ అయ్యి అధికారంలో ఉన్న వైయస్ జగన్ ని ఇరుకున పెట్టడానికి మొన్నటి వరకు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఢిల్లీలో ఎలాగైనా మోడీతో భేటీ అయ్యి గత ఎన్నికల సమయంలో చేసిన పొరపాట్లకు క్షమాపణ అడగాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్న తరుణంలో మొన్నటివరకు రాష్ట్రంలో చంద్రబాబుకు అనుకూలంగా ఉండే బీజేపీ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ని ఒక్కసారిగా ఢిల్లీ పెద్దలు మార్చడంతో, ఇప్పుడు చంద్రబాబు కి అన్ని దారులూ మూసేసినట్లయింది. పార్టీకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు మాత్రం చంద్రబాబు పెత్తనం గాని ఆలోచన గాని బిజెపి పార్టీ పై ప్రభావం చూపించకుండా అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అస్సలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఇప్పటివరకు ఎదగక పోవడానికి కారణం చంద్రబాబే అని చాలా బలంగా సోము వీర్రాజు నమ్ముతున్నారు. మొదటి నుండి బీజేపీ లో ఉన్న సోము వీర్రాజు చంద్రబాబు వ్యతిరేకిగా ఉన్న నాయకుడు, చాలా సార్లు చంద్రబాబుకు వ్యతిరేకంగా మీడియా ముందు తీవ్ర స్థాయిలో మండిపడ్డిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది తాజాగా అధ్యక్షుడి పదవి చేపట్టడంతో సోము వీర్రాజు ని ఏ మాత్రం చంద్రబాబుకి బీజేపీ లోకి రావటానికి దారులు లేకుండా…. ఢిల్లీ స్థాయి నుండి బిజెపి కార్యకర్త వరకు అన్ని రీతిలో తన మార్క్ లీడర్ షిప్ ఉండేలా సోము వీర్రాజు డీల్ చేస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీని కూడా పూర్తిగా బిజెపి కనుసన్నల్లోనే నడిచే విధంగా సోము వీర్రాజు సరైన స్కెచ్ వేసినట్లు, పవన్ కళ్యాణ్ నీ పూర్తిగా చంద్రబాబు కి దూరం చేయాలనే ఆలోచనలో సోము వీర్రాజు నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. చంద్రబాబు చాలా వరకు రాబోయే 2024 ఎన్నికలలో బీజేపీతో కలిసి పని చేయాలనే ఆలోచనతో రాజకీయ ఎత్తుగడలు వేసుకున్నారు. ఇటువంటి తరుణంలో బాబు వేస్తున్న వ్యూహాలకు సోము వీర్రాజు చాలా వరకు పులిస్టాప్ పెట్టేటట్లు వ్యవహరించడం, ఇది టిడిపి పార్టీకి పెద్ద మైనస్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.